వైయస్ వివేకా హత్య : తొమ్మిద ప్రశ్నలు = సమాధానం

తాజా విశ్లేషణలు
4
(1)

వివేకా హత్యలో సీబీఐ విచారణను వేగవంతం చేయటం.ఈ కథలో పాత్రధారులు మరియు సూత్రధారులు త్వరలో అధికారికంగా తేలిపోనుంది. ఇప్పటి వరకు జరిగిన హత్య కు సంభందించి కొన్ని ప్రశ్నలు మరియు విశ్లేషణ .

మొదటి ప్రశ్న – వివేకా గది , బాత్రూమ్ రక్తం మరకలను ఎందుకు శుభ్రం చేయించినట్టూ ?

హత్య లేదా ఆత్మ హత్య చేసుకున్న సమయంలో పోలీసులు చేసే పంచనామా కాకుండా వైయస్ అవినాష్ రెడ్డి గదిని మరియు బాత్రూమ్ రక్తం మరకలను ఎందుకు శుభ్రం చేయించినట్టూ ?.

రెండోప్రశ్న – గుండె పోటు అని ఎందుకు చెప్పారు?

అది ప్రత్యర్థులు చేసిన హత్య అయితే గుట్టుచప్పుడు కాకుండా భారతి తండ్రి గంగి రెడ్డి హాస్పటల్ కాంపౌండర్ ఉదయ్ రెడ్డి చేత కుట్లు వేయించి, గుండె పోటు అని తమ చానల్ లో ఎందుకు ప్రచారం చేశారు.

మూడో ప్రశ్న – స్వంత బాబాయ్ హత్య కి సీబీఐ అవసరం లేదు అని ముఖ్యమంత్రి జగన్ ఎందుకన్నాడు ?

ఎన్నికల సమయంలో ముందు గుండె పోటు గా ప్రచారం చేసిన భారతి సాక్షీ చానల్. అజ్ఞాత వ్యక్తి వాట్సాప్ ద్వారా సునీత కి పంపిన వివేకా బాత్రూమ్ హత్య ఫోటోలు చూసి అనుమానం వ్యక్తం చేయటం. పోస్టుమార్టం కోరటం, దాంతో విషయం బయటకి పొక్కింది.

అప్పటి ప్రతిపక్ష నేత అయిన జగన్ సీబీఐ దర్యాప్తు డిమాండ్ చేయటం జరిగింది. మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని భారతి సాక్షి పాపర్ కథనాలు ప్రత్యక్షం అయ్యాయి.

మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న జగన్ బాబాయ్ హత్య విషయంలో సీబీఐ అవసరం లేదని ఎందుకన్నాడు ?.

నాలుగో ప్రశ్న- ముఖ్యమంత్రి సొంత చెల్లి & వివేకా కూతురు సునీత తనకి ప్రాణ హాని ఉందని ఎందుకు చెప్పినట్టు?

తన తండ్రి హత్య విషయంలో సీబీఐ దర్యాప్తు కోసం కోర్టులు చుట్టూ తిరుగుతూ వైయస్ సునీత పోరాటం చేస్తున్న ఒకానొక సందర్బంలో తన కి ప్రాణ హాని ఉందని చెప్పటం. ఇలా అనటం స్వయానా అన్న ముఖ్యమంత్రి గా ఉన్న జగన్ ని వేలెత్తి చూపించినట్టే అవుతుంది.

ఐదో ప్రశ్న- వైయస్ఆర్ తమ్ముడు ని ఇంటి దొంగలు ప్రమేయం లేకుండా హత్య చేసే ధైర్యం ఉందా ?

ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు , ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ అయిన వైయస్ వివేకాని చంపే ధైర్యం సామాన్య నాయకులకు ఉందా?.

సీబీఐ కోర్టుకు పోందు పరిచిన సమాచారం పరంగా ఇంటికి సంబంధించిన వ్యక్తులు వైయస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి బాస్కర్ రెడ్డి ప్రధాన సూత్రధారుకు గా ఉన్నప్పటికీ పెద్ద తలకాయల అండ లేకుండా హత్యకు పథకం పన్నారా ?

ఆరో ప్రశ్న- కేవలం తన ఎంపీ సీటుకోసం హత్య చేయించే సాహసం చేస్తారా?

ప్రధాన నిందితుడు వైయస్ అవినాష్ కేవలం ఒక ఎంపీ సీటుకోసం లేకా రాజకీయ స్వలాభం కోసం స్వయానా వరసకు బాబాయ్ మరియు జగన్ కు స్వంత బాబాయ్ ని హత్య చేయించే దైర్యం ఉందా?. పైగా అవినాష్ రెడ్డిని జమ్మల మడుగు ఏం. ఎల్. ఏ గా వివేకానే ప్రతిపాదించాడు.

కడప కు సంబంధించి వైయస్ బాస్కర్ రెడ్డి కుటుంబం ఎటువంటి పట్టులేదని వారంతట వారుగా చంపే తెగింపు లేదని అక్కడి ప్రజల వాదన.

ఏడో ప్రశ్న- షర్మిల కు ఎంపీ సీటు ఇవ్వాలని వైయస్ వివేకా పట్టుబట్టడం హత్యకు ప్రధానం కారణమా?

జగన్ జైలు కు వెళ్ళిన సమయంలో పార్టీకీ నడిపించిన వ్యక్తి ,జగన్ వదిలిన బాణం గా పార్టీకోసం ప్రచారం చేసిన షర్మిళ కి కడప ఎంపీ సీటు కావాలని పట్టుబడటం కూడా హత్య కు ప్రధాన కారణమా ?. అయితే వైయస్ వివేకాని చంపితే ఎవరికి లాభం.

మొదటిగా జగన్ కు షర్మిళ ను పార్టీకి సంబందించిన పదవి ఇచ్చి వైకాపా లో మరో పవర్ సెంటర్ అవ్వటం ఇష్టం లేదా ?. వైయస్ భారతితో షర్మిల కు పోసగదని బహిరంగ రహస్యం. తాము అధికారంలో కి వచ్చేస్తున్నాం. ఒక వేల సీ బీ ఐ ఆక్రమాస్తుల కేసుల్లో కేంద్రం సహకరించకపోతే జగన్ జైలుకు వెళ్ళటం. భారతి సీ.ఏం అవ్వటం ఖాయం. కానీ అదే షర్మిళ పార్టీలో ఉంటే వైయస్ భారతి కి పార్టీలో ఎప్పటికీ పక్కలో బల్లెం అవుతారని బావించారా?.

దీనికి తోడు వైయస్ వివేకా పార్టీకీ కష్ట సమయంలో ఉన్న షర్మిల కు పార్టీలో తగిన గుర్తింపు లేదని భావనలో ఉన్న వైయస్ వివేకా ఎప్పటికైనా షర్మిల కే మద్దతు నిలుస్తారని భావించారా? ఆదేకాక జగన్ మరియు షర్మిల ఆస్తి పంపకాల్లో షర్మిల కు అండగా ఉంటారని భావించారా?.

స్వాయాన భారతి మేనమామ కొడుకు అయిన వైయస్ అవినాష్ కు మరియు కుటుంబాన్ని రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ మరియు భారతి భావించారా?.

ఎనిమిదో ప్రశ్న- భారతి మరియు జగన్ కి 3 గంటల ప్రాంతంలో పదుల సంఖ్యలో అన్ని కాల్స్ వైయస్ అవినాష్ ఎందుకు చేశాడు?

సీబీఐ విచారణలో వైయస్ అవినాష్ పదుల సంఖ్యలో భారతి మరియు జగన్ కు సంబందించిన పీఏ లకు ఎందుకు కాల చేసిననట్టు?.

తనకు ఉదయం 5 గంటలకు హత్య విషయం తెలిసింది అన్న అవినాష్ 3 గంటలకు చేసి వైయస్ వివేకా హత్య గురించి ఎలా చెప్పారు?.

అసలు స్వంత వదిన లేకా అన్నకు వారి పర్సనల్ నెంబర్ కు కాల్ చేయకుండా ? పీఏ లకు ఎందుకు కాల్ చేసినట్టు?.

అ సమయంలో కూడా పీఏ లు అక్కడ ఉంటారా ?.

అ సమయం లో అన్నీ సార్లు ఎందుకు కాల్ చేశారు ? ఏం మాట్లాడారు ? .

ఒక వేళ జగన్ దంపతులకు హత్య గురించి ముందే తెలిసిందా ?.

లేకా వారి సహకారంతోనే జరిగిందా ?.

మరి వివేకా కూతురు వైయస్ సునీత కు ఎందుకు కాల్ చేయనట్టు? .

తొమ్మిదో ప్రశ్న- హత్య జరిగిన రోజే జగన్ బాబాయ్ హత్య ఏ విధంగా చంపారో? ఎలా తెలిసింది ?

హత్య జరిగిన రోజు జగన్ తన బాబాయ్ హత్య ఎలా జరిగింది అని కళ్లకు కట్టినట్టుగా మీడీయాకు తెలియచేసారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే హత్య చేసిన వ్యక్తుల్లో ఒకరైనా అప్రూవర్ గా మారిన దస్తగిరి హత్య జరిగిన విధానం చెప్పేవరకు ఎవరికీ తెలియదు.

కానీ జగన్ మాత్రం ఎలా చెప్పగలిగారు?.

ఇప్పటికే అవినాష్ మరియు భాస్కర్ రెడ్డి హత్య కు ప్రధాన సూత్రదారులు అని తెలంగాణ హైకోర్ట్ పాత్ర ధారుడు సునీల్ బెయిల్ పిటిషన్ రద్దుకు సీబీఐ సాక్షాలను సమర్పించింది.

రేపు అవినాష్ రెడ్డి విచారణ చేసి అరెస్ట్ చేస్తారా? మరికొన్ని పెద్ద తలకాయలుకు విచారణ కు పిలిచే అవకాశం లేక పోలేదు.

ఎన్నో సంవత్సరాలు తన తండ్రిని హత్య చేసిన హంతకులు శిక్ష వేయించాలనుకున్న వైయస్ సునీత కృషి త్వరలో ఫలించబోతున్నట్టే కనపడుతుంది.

— పి. కృష్ణ

నిరాకరణలు: వెబ్‌సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్‌సైట్ సబ్‌డొమైన్‌లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి

Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.

Click on a star to rate it!

Average rating 4 / 5. Vote count: 1

No votes so far! Be the first to rate this post.