పవన్ కళ్యాణ్ కి రాజకీయాల్లో నిలకడ లేదు…. నిర్దిష్టమైన అభిప్రాయం లేదు….స్పష్టమైన నిర్ణయంలేదు , ఇవి సగటు ప్రజానీకానికి పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిప్రాయం. ప్రస్తుతం పవన్ జనసేన ని నేలవిడిచి సాముచేసి పని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ 2019 జనసేన ఓటమితో వాస్తవికతను గుర్తించి పార్టీని బలపరిచే దిశగా అడుగులు వేస్తున్నాడు. టీడీపీ తో పొత్తు ప్రకటించటం. ఆ పై ఇరుపార్టీల క్యాడర్ సామరస్యత తగిన విధంగా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ పొత్తు తో పవన్ కళ్యాణ్ మొదటిగా జగన్ ని గద్దె దించటం, తను శాసన సభ్యుడిగా శాసన సభలో అడుగుపెట్టటం, పార్టీకి 15 నుంచి 20 శాసన సభ్యులను గెలిపించికోవాటం టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
ఇక ముఖ్య మంత్రి అంటారా ? ముఖ్యంగా 2029 ఎన్నికలకు ముఖ్యమంత్రి పదవి కి టార్గెట్ గా ముందుకు వెళ్తారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతుంది. అదృష్టం కలిసి వచ్చి సంకీర్ణ ప్రభుత్వం వస్తే అప్పుడూ అవకాశం ఉంటుందని భావిస్తూండొచ్చు.
జనసేన – బీజేపీ దోస్తీ గత నాలుగేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. బీజేపీ చెప్పినట్లు పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నారు. ఉపఎన్నికల విషయంలో అత్యధక ఓటు శాతం ఉన్న పార్టీ పోటీ కి నిలపెడుతుంది.
కానీ విచిత్రంగా నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ అభ్యర్థి నిలబెట్టటం. మెజార్టీ ఓటు షేర్ ఉన్న జనసేన , బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూడటం హాస్యాస్పదం.
పవన్ కళ్యాణ్ ఎందుకు బీజేపీ తోనే ఉండటానికి ఎందుకు వెంపర్లాడుతున్నారో? సామాన్య ప్రజానీకానికి అంతు చిక్కని అంశం. టీడీపీ తో పొత్తు ప్రకటన అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కలసి వస్తే బీజేపీ ని కలుపుకుంటాం అని ప్రకటించాడు .

బీజేపీ పార్టీ పై తెలుగు ప్రజల్లో తీవ్ర వ్యతిరేఖత ఉంది. ప్రత్యేక హోదా , స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ , పోర్ట్స్ ప్రవేటీకరణ, వంటి అంశాలలో ఆంధ్ర ప్రదేశ్ అన్యాయం చేశారని ప్రజలు భావిస్తున్నారు.
ఒకపక్క పవన్ కళ్యాణ్ తో మిత్ర పక్షం గా ఉంటూ బీజేపీ జగన్ తో లోపాయికారి ఒప్పందం పెట్టుకుందని జరుగుతున్న పరిణాలు తెలియజేస్తున్నాయి.
పవన్ ని మిత్రపక్షం గా పెట్టుకొని పవన్ కళ్యాణ్ ని టీడీపీ తో కాలవనీయకుండా చేస్తే వ్యతిరేక ఓటు చీలి జగన్ లాభిస్తుంది అని బీజేపీ ఆలోచన. ఒకవేళ టీడీపీ – జనసేన కూటమి బీజేపీ కూడా కలుపుకుపోతే అది సూసైడ్ కిందే భావిచాల్సి ఉంటుంది. తెలుగు ప్రజలు ఎక్కడున్నా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తారు అనటానికి కర్ణాటక ఎన్నికలే నిదర్శనం.
ఇకనైనా పవన్ కళ్యాణ్ బీజేపీ వదిలి టీడీపీ పార్టీతో కలసి వెళ్తే ఒక కీలక రాజకీయ పార్టీ గా బలపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.
— పి. కృష్ణ
నిరాకరణలు: వెబ్సైట్ యొక్క www.toliadugu.com లేదా సబ్డొమైన్లలో ప్రచురించబడిన కథనాలు మరియు కంటెంట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. www.toliadugu.com లేదా వెబ్సైట్ సబ్డొమైన్లలో ప్రచురించబడిన కథనాలలో ఉపయోగించిన మొత్తం సమాచారం విశ్వసనీయ మూలాల నుండి వచ్చినదని విశ్వసించబడింది, అయితే మేము దీనితో సంపూర్ణత, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయత గురించి ఎలాంటి ప్రాతినిధ్యాలు లేదా హామీలు ఇవ్వము, వ్యక్తీకరించాము లేదా సూచించాము ఈ వ్యాసానికి సంబంధించి
Disclaimers: Articles and Content published on www.toliadugu.com or subdomains of the website, is just for informational purposes only. All information used in the articles published on www.toliadugu.com or subdomains of the website is believed to be from reliable sources, but we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, or reliability with respect to these article.